గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఫేమస్ లీడర్.. ఒకప్పడు సీమ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్

1 year ago 33
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన జేసీ దివాకర్ రెడ్డి లేటెస్ట్ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఒకప్పుడు గంభీరంగా కనిపించే జేసీ దివాకర్ రెడ్డి ప్రస్తుతం అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. 80 ఏళ్ల జేసీ దివాకర్ రెడ్డి వయసు పెరగటంతో పాటుగా జ్ఞాపకశక్తి తగ్గి ఇబ్బందులు పడుతున్నట్లు సన్నిహితులు చెప్తున్నారు. అలాగే నడవడానికి సైతం కాస్త అసౌకర్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. కుమారుడు, మనవడితో కలిసి జేసీ ఉన్న ఫోటో వైరల్ అవుతుండగా.. ఫోటో చూసిన నెటిజనం జేసీ ఇలా అయ్యారేంటని ఆశ్చర్యపోతున్నారు.
Read Entire Article