వరంగల్ శివాలయం కూల్చివేత తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. ఘటనాస్థలికి వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాకతీయులు కట్టించిన ఆలయం కింద ఉండే గుప్త నిధుల కోసమే కూల్చివేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో ఆలయాలను డెవలప్ చేస్తే.. కాంగ్రెస్ హయాంలో కూల్చివేస్తున్నారని మండిపడ్డారు.