తన ఓటు గల్లంతైందంటూ మాజీ మంత్రి శనక్కాయల అరుణ గుంటూరు కలెక్టరేట్లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. తాను 45 ఏళ్లుగా గుంటూరులో ఓటు వేస్తున్నానని.. అలాంటిది తన ఓటు గుంటూరు -1, గుంటూరు -2లలో రెండు చోట్లా కూడా కనిపించడం లేదని శనక్కాయల అరుణ ఆరోపించారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానన్నారు. అయితే శనక్కాయల అరుణ ఓటు ఉందని.. డిజిటలైజ్ ప్రక్రియ కూడా పూర్తయిందని గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు ప్రకటించడం గమనార్హం.