సాయికృష్ణ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు సోమవారం లొంగిపోయారు. హెడ్ కానిస్టేబుళ్లు నాని, అశోక్ సూర్యారావుపేట ఏసీపీ కార్యాలయంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. సాయికృష్ణ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజుకు వీరిద్దరూ సహకరించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ కేసులో నిందితులుగా చేర్చారు. అయితే సిట్ విచారణ మొదలైన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన ఈ ఇద్దరు.. ఇప్పుడు లొంగిపోవటంతో కేసులో కీలక చిక్కుముడి వీడే అవకాశాలు ఉన్నాయి.