విజయనగరం సంస్థానానికి చెందిన స్థలంలో వైసీపీ జిల్లా ఆఫీసును నిర్మించారంటూ గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తమ భూమిని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ వైసీపీ పార్టీకి లీజుకు ఇచ్చారని.. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అక్కడ ఆఫీస్ నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. దీనిపై జిల్లా కలెక్టర్కు ఆయన ఫిర్యాదు చేయటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.