మాజీ మావోయిస్టు దేవ్జీ (63) దాదాపు 40 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మారి ఇంటర్మీడియట్ పరీక్ష రాశారు. 1983లో పోలీసుల జోక్యానికి నిరసనగా ఇంటర్ పరీక్షలకు దూరమైన ఆయన.. ఇప్పుడు సామాన్య పౌర జీవితంలో భాగంగా చదువును పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని పరీక్షా కేంద్రంలో తెలుగు పేపర్ రాసిన దేవ్జీ.. భవిష్యత్తులో న్యాయవాదిగా మారి పేదల తరపున పోరాడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.