తాను కొత్త పార్టీ పెడుతున్నారంటూ వస్తున్న వార్తలను కేంద్రమంత్రి బండి సంజయ్ ఖండించారు. తాను బీజేపీలో నిబద్ధతతో పనిచేసే కార్యకర్తను అని పేర్కొన్న బండి సంజయ్.. తాను చనిపోయిన తర్వాత తనపై బీజేపీ జెండా కప్పాలని కోరుకుంటానని తేల్చి చెప్పారు. ఇక ఎక్కడైనా ఒక కన్న తండ్రి.. తన కుమారుడిని పోలీసులకు అప్పగించిన సందర్భం ఉందా అని ప్రశ్నించారు. విచారణకు సహకరించాలనే తాను అలా చేసినట్లు బండి సంజయ్ స్పష్టం చేశారు.