కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన చంద్రబాబు.. శ్రీశైలం ప్రాజెక్టులో నాలుగు గేట్ల ఎత్తివేత!

11 months ago 19
శ్రీశైలం జలాశయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. ఎగువ రాష్ట్రాల్లో వర్షాల కారణంగా శ్రీశైలం నిండుకుండలా మారడంతో దిగువకు నీటిని విడుదల చేశారు. రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు శ్రీశైల మల్లన్నకు పూజలు చేశానని ఆయన తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులకు తమ ప్రభుత్వం రూ. 68 వేల కోట్లు ఖర్చు చేసిందని, పోలవరం ప్రాజెక్టు ద్వారానే రాయలసీమకు నీళ్లు వస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. సముద్రంలో కలిసే కృష్ణా జలాలను తెలుగు రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.
Read Entire Article