'కూట్లో రాయి తీయలేనోడు.. ఏట్లో రాయి తీస్తాడట..' పవన్‌పై రెచ్చిపోయిన మంత్రి పొన్నం

1 month ago 11
జనసేనాని పవన్ కళ్యాణ్ తెలంగాణలో నిర్వహించ తలపెట్టిన ‘నవనిర్మాణ సభ’లపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో తెలంగాణ సమాజంపై విషం కక్కిన పవన్, ఇక్కడి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే సభల గురించి ఆలోచించాలని డిమాండ్ చేశారు. పవన్ పూర్తిగా బీజేపీ ఎజెండాతో, వారి డైరెక్షన్‌లోనే తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వస్తున్నారని ఆరోపించారు. ఏపీలో విశాఖ ఉక్కు, అదానీ పోర్టుల వ్యవహారాలపై నోరు మెదపని పవన్, ఇక్కడ రాజకీయాలు చేయడం హాస్యాస్పదమన్నారు.
Read Entire Article