కూకట్‌పల్లి సహస్ర హత్య కేసులో కీలక మలుపు.. మిస్టరీని ఛేదించిన పోలీసులు..

9 months ago 14
హైదరాబాద్ కూకట్‌పల్లిలో 12ఏళ్ల సహస్ర హత్య కేసులో పోలీసులు మిస్టరీని ఛేదించారు. దర్యాప్తులో భాగంగా పక్కింట్లో నివసిస్తున్న పదో తరగతి విద్యార్థి నిందితుడని తేలింది. దొంగతనం ఉద్దేశంతో ఇంట్లోకి ప్రవేశించిన అతడు.. బాలికను చూసి భయంతో హత్య చేసి నగదు దోచుకున్నట్లు విచారణలో బయటపడింది. ప్రస్తుతం నిందితుడు అదుపులో ఉండగా.. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో ప్రాంత ప్రజలు తీవ్ర ఆవేదనకు గురవగా.. చిన్నారిని బలిగొన్నది ఒక విద్యార్థి కావడం మరింత కలకలాన్ని రేపింది.
Read Entire Article