Mohammad Pasha Kurchi Thatha Passed Away: సోషల్ మీడియాలో కుర్చీ మడతపెట్టి డైలాగ్తో ఫేమస్ అయిన కుర్చీ తాత అలియాస్ షేక్ మహ్మద్ పాషా అలియాస్ పాషా మృతిచెందారు. ఎండల తీవ్రత, అనారోగ్య సమస్యల కారణంగా చనిపోయారు. మంగళవారం సాయంత్రం ఆయన అస్వస్థతకు గురికాగా వైద్యం అందించారు.. బుధవారం సాయంత్రం ఆయన ఇంట్లో కన్నుమూశారు. గుంటూరు కారం సినిమాలో పాషా కుర్చీని మడతపెట్టి డైలాగ్ వాడేశారు. అప్పటి నుంచి పాషా బాగా ఫేమస్ అయ్యారు.