కిర్లంపూడి: ముద్రగడ పద్మనాభం పాడె మోసిన వైఎస్ జగన్ ..

5 days ago 3
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ హాజరయ్యారు. హెలికాప్టర్‌లో జగ్గయ్యపేటకు చేరుకున్న జగన్.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కిర్లంపూడి వెళ్లారు. పద్మనాభం భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం.. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం ముద్రగడ పద్మనాభం పాడె మోసిన జగన్.. అంతిమ వీడ్కోలు పలికారు. అంతకుముందు భీమవరంలో పర్యటించిన వైఎస్ జగన్.. ఆక్వా రైతులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. అనంతరం అక్కడి నుంచి కిర్లంపూడికి చేరుకున్నారు.
Read Entire Article