కాళేశ్వరం విచారణ నివేదిక.. ప్రభుత్వానికి సమర్పించిన పీసీ ఘోష్‌ కమిషన్‌

11 months ago 19
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ప్రాజెక్టులో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్ 15 నెలల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై లోతుగా విచారణ చేపట్టింది. ఈ విచారణలో భాగంగా మొత్తం 115 మందిని విచారించి వారి వాంగ్మూలాలను నమోదు చేసింది. తుది నివేదికను సీల్డ్ కవర్‌లో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేశారు.
Read Entire Article