దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం కాళేశ్వరం భారీ పునర్నిర్మాణ పనులకు సిద్ధమవుతోంది. దశాబ్దాల క్రితం నాటి ఆలయాలు, మండపాలు, ప్రాకారాల స్థానంలో రూ.198 కోట్ల వ్యయంతో శాశ్వత రాతి కట్టడాలను నిర్మించడానికి దేవాదాయశాఖ వేగంగా అడుగులు వేస్తోంది. దీనికోసం జూన్ చివరి వారంలో ప్రస్తుత నిర్మాణాల తొలగింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టుకు సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే భూమిపూజ చేయగా.. శృంగేరి పీఠం అనుమతులు కూడా లభించాయి. అయితే 2027 జూలైలో జరిగే గోదావరి పుష్కరాల నాటికి ఈ పనులు నాణ్యతతో పూర్తి కావడంపై భక్తుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.