తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న టిమ్స్ ఆసుపత్రులలో వైద్య సేవలను మరింత విస్తృతం చేయాలని నిర్ణయించింది. గతంలో ప్రకటించిన ఒక్కో సూపర్ స్పెషాలిటీ విభాగానికి తోడుగా.. ఇప్పుడు ప్రతి టిమ్స్లో రెండేసి ప్రత్యేక విభాగాలను అందుబాటులోకి తెచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. వీటికి స్వతంత్ర హోదా కల్పిస్తూ ప్రత్యేక డైరెక్టర్లను నియమించనున్నారు. అలాగే ప్రపంచ బ్యాంకు మంజూరు చేసిన రూ. 4,150 కోట్ల రుణంతో నీలోఫర్, ఎంఎన్జే ఆసుపత్రులను ప్రక్షాళన చేయనున్నారు.