హనుమకొండ జిల్లా కాజీపేట అయోధ్యపురంలోని నూతన రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో త్వరలోనే ఉత్పత్తి ప్రారంభం కానుందని రైల్వే బోర్డు ఛైర్మన్ సతీశ్కుమార్ ప్రకటించారు. ఆదివారం దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవతో కలిసి ఆయన ఫ్యాక్టరీని పరిశీలించారు. ఇక్కడ నూతన తరం కోచ్లు తయారవుతాయని, స్థానిక ఉద్యోగాల కల్పనపై చర్చిస్తామని తెలిపారు. అలాగే కాజీపేట అమృత్భారత్ పనులు, సిగ్నల్ ఇంజినీరింగ్ ఇన్స్టిట్యూట్లో కవచ్ 4.0 సాంకేతికత అమలు తీరును ఆయన సమీక్షించారు.