తన పార్టీ, జెండాలో పసుపు రంగు, చంద్రబాబు హస్తం గురించి కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కవిత వెనుక చంద్రబాబు ఉన్నారనే ఆరోపణలు వెల్లువెత్తిన వేళ.. ఆమె పార్టీ టీఆర్ఎస్ జెండాలో పసుపు రంగు ఎందుకు ఉంచారు అనే దానిపై ఆమె క్లారిటీ ఇచ్చారు. పసుపు రంగు భూమి పుట్టినప్పటి నుంచి ఉందని.. అది ఒక్క టీడీపీకి సొంతం కాదని తేల్చి చెప్పారు.