ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ఢిల్లీకి వెళ్లారు. ఈ పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఆమె సమావేశం అయ్యారు. కర్ణాటక నుంచి తనకు రాజ్యసభ సభ్యురాలిగా అవకాశం ఇవ్వాలని రాహుల్ గాంధీని.. వైఎస్ షర్మిల కోరినట్లు తెలుస్తోంది. అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం సహా పలు అంశాలపై రాహుల్ గాంధీతో చర్చించినట్లు వైఎస్ షర్మిల పేర్కొన్నారు.