కరీంనగర్‌లో కాల్పుల కలకలం.. జ్యువెలరీ షాపులో భారీ చోరీ

2 months ago 13
కరీంనగర్ నగర నడిబొడ్డున దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పీఎంజే జ్యువెలరీ షాపుపై దాడి చేసిన ఐదుగురు దుండగులు.. అడ్డువచ్చిన సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను దోచుకుని పరారైన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నగరంలో హై అలర్ట్ ప్రకటించి సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు.
Read Entire Article