కడప స్టీల్ ప్లాంట్కు 2007లోనే తొలిసారి శంకుస్థాపన చేశారు. ఇప్పటికే ఎప్పుడో పనులు పూర్తయ్యి.. ఉత్పత్తి ప్రారంభం కావాల్సింది. వేలాది మందికి ఉపాధి లభించాల్సింది. కానీ రకరకాల కారణాలతో ఉక్కు కర్మాగారం పనులు ముందుకు సాగలేదు. ఇప్పటి వరకు నాలుగుసార్లు శంకుస్థాపనలు జరగ్గా.. ఈసారి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పనులు ప్రారంభం అవుతున్నాయి. ఇప్పుడైనా స్టీల్ ప్లాంట్ ఏర్పాటవుతుందా? లేదా అనే అనుమానం కడప జిల్లా వాసుల్లో ఉంది.