కడప జిల్లాలోని అల్మాస్ పేట సర్కిల్ వద్ద ఉద్రిక్తతలు తలెత్తాయి. అల్మాస్ పేట సర్కిల్ పేరు విషయంలో రెండు వర్గాలు రాళ్ల దాడులకు దిగటంతో శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఇరు వర్గాలపై లాఠీచార్జ్ చేశారు. అయితే రాళ్ల దాడిలో సీఐతో పాటుగా ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఉద్రిక్తతలను చల్లార్చేందుకు రెండు వర్గాలతో పోలీసులు మాట్లాడుతున్నారు. వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.