ఓటు పడకపోయినా నిధులు.. ఆ గ్రామాలకు శుభవార్త చెప్పిన మంత్రి పొన్నం..

5 months ago 17
కరీంనగర్‌లో జరిగిన నూతన సర్పంచుల ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. అనివార్య కారణాలతో ఎన్నికలు జరగని గ్రామాలకు కూడా నిధులు మంజూరు చేస్తామని.. ఏ ఊరు అభివృద్ధిలో వెనుకబడకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సర్పంచులు రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేయాలని.. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, ఉపాధి హామీ పథకం రక్షణపై దృష్టి సారించాలని కోరారు. వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. గ్రామాభివృద్ధిలో సర్పంచులకు ప్రభుత్వం , శాసనసభ్యులు పూర్తి అండగా ఉంటారని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.
Read Entire Article