ఏపీవైపు దూసుకొస్తున్న వాయుగుండం.. ఈ జిల్లాలపై తీవ్ర ప్రభావం, వాతావరణశాఖ హెచ్చరిక

1 year ago 23
Ap Weather Today: బంగాళాఖాతంలో ఉన్న తీవ్రఅల్పపీడనం మరింత బలపడి మంగళవారం రాత్రికి వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం చెన్నైకి 440 కిమీ, పుదుచ్చేరికి460 కిమీ, నెల్లూరుకి530కిమీ దూరంలో ఉంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి 17వ తేదీ ఉదయం నెల్లూరు, పుదుచ్చేరి మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురవనున్నాయి.
Read Entire Article