శ్రీసత్యసాయి జిల్లాకు మరో భారీ పెట్టుబడి రానుంది. సత్యసాయి జిల్లాలో 51 వేలకోట్ల రూపాయల పెట్టుబడితో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి ఏపీ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో ఆమోదం లభించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రూ.2 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. మరోవైపు సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో డీఆర్డీవో యుద్ధ విమానాల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నెలలోనే దీనికి శంకుస్థాపన జరగనుంది.