ఏపీలో భానుడు భగభగ మండిపోతున్నాడు. దీంతో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం పలు జిల్లాలలో 46 నుంచి 48 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యేందుకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఎండల తీవ్రత, అతి తీవ్ర వడగాలుల నేపథ్యంలో విశాఖ వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వడగాలులు, ఎండల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.