Andhra Pradesh High Temperatures And Rains: ఏపీలో ఎండల తీవ్రత కొనసాగుతోంది.. ఇవాళ 45 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే ద్రోణి ప్రభావంతో నేడు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటున్నారు. పల్నాడు, మార్కాపురం, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.