AP Govt Fee Reimbursement For Deemed Universities Students: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీమ్డ్ యూనివర్శిటీల్లో చదివే విద్యార్థులకు ఊరట కల్పించింది. డీమ్డ్ వర్శిటీల్లో చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించేలా ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర పథకంతో అనుసంధానం చేసి.. కేంద్రం నుంచి కొంత, రాష్ట్ర ప్రభుత్వం కొంత కలిపి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తారు. తాజా నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల విద్యోన్నతికి చేయూత ఇస్తోంది.