ఏపీలో వింత వాతావరణం.. ఓ వైపు ఎండ, మరోవైపు వర్షాలు, నేడు ఈ జిల్లాల్లో వానలకు ఛాన్స్

1 month ago 14
ఆంధ్రప్రదేశ్‌లో నేడు, రేపు విభిన్న వాతావరణం ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఓవైపు ఎండలతో పాటు పిడుగులతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మన్నార్ గల్ఫ్ వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో మన్యం, అల్లూరి, పోలవరం, ఏలూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడవచ్చునని చెప్పారు. పిడుగులు పడే ముప్పు ఉన్నందున రైతులు, పశుకాపరులు చెట్ల కింద ఉండరాదని అధికారులు సూచించారు. వాతావరణ మార్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Read Entire Article