ఏపీలో మరో బస్సు ప్రమాదం.. హైదరాబాద్‌కు వస్తుండగా ఘటన..

8 months ago 23
తెలుగు రాష్ట్రాలలో మరో బస్సు ప్రమాదం జరిగింది. ఏలూరు జిల్లా లింగపాలెం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న భారతి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. జూబ్లీనగర్ సమీపంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయినట్లు తెలిసింది. పలువురు గాయపడినట్లు సమాచారం. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Entire Article