ఏపీలో మరో కొత్త వాలంటీర్ వ్యవస్థ.. 30 వేలమందికి అవకాశం..

6 months ago 25
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పాముకాటు మరణాలను నివారించేందుకు సరికొత్త ఆలోచన చేసింది. సర్పమిత్ర పేరుతో గ్రామాల్లో వాలంటీర్లను ఏర్పాటు చేయనుంది. పాములను బంధించడం, పాముకాటుకు గురైన వారికి ప్రథమ చికిత్స అందించడం వీరి పని. హనుమాన్ ప్రాజెక్టులో భాగంగా సర్పమిత్ర వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది ఏపీ అటవీ శాఖ. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది సర్పమిత్రలను నియమించనుంది. వీరికి ప్రోత్సాహకాలు కూడా అందించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆదేశించారు.
Read Entire Article