ఏపీలో భానుడి ఉగ్రరూపం.. ఏకంగా 45 డిగ్రీల వరకు, ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ

3 months ago 21
Andhra Pradesh High Temperatures: ఏపీలో సూర్యుడి భగభగలు కొనసాగుతున్నాయి.. రాష్ట్రంలో మాడుపగిలేలా ఎండల తీవ్రత కనిపిస్తోంది. కొద్దిరోజులుగా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలకు తోడు వేడిగాలులు, ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. ఇటు అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు కూడా పడుతున్నాయి. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణసంస్థ తెలిపింది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం మంచిదని సూచిస్తున్నారు.. ఒకవేళ వెళితే జాగ్రత్తగా ఉండాలి అన్నారు.
Read Entire Article