ఏపీలో పేదలకు ఇళ్లు నిర్మించేందుకు నేను స్థలం ఇస్తా.. వృద్ధురాలి పెద్ద మనసు

1 year ago 41
Andhra Pradesh Woman Donates Land For Poor: తమ ఊరిలో ఉన్న పేదల కోసం ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తే అందుకు అవసరమైన స్థలాన్ని ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పల్నాడు జిల్లాకు చెందిన ఓ వృద్ధురాలు ముందుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఈ విషయాన్ని తెలియజేశారు. పల్నా డు జిల్లా నకరికల్లు మండలం కమ్మవారిపాలెంకు చెంది న నరిశెట్టి రాజమ్మ అనే వృద్ధురాలు.. సీఎం చంద్రబాబును కలిసి వరద బాధితుల సహాయార్థం రూ.50వేలు ఇచ్చారు. తమ గ్రామంలోని 15 పేద కుటుంబాలకు ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇస్తే.. అందుకు తన సొంత స్థలాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని రాజమ్మ చెప్పారు. పేదల ఇళ్ల నిర్మాణం కోసం ఉదారంగా స్థలం ఇచ్చేందుకు ముందుకొచ్చిన ఆమెను చంద్రబాబు అభినందించారు.
Read Entire Article