ఏపీలో నిరుపేదలకు శుభవార్త.. మరో హామీ అమలుకు కసరత్తు.. మొదలైన దరఖాస్తుల స్వీకరణ!

1 year ago 36
ఏపీలోని నిరుపేదలకు శుభవార్త.. మరో హామీ అమలుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్నికల సమయంలో నిరుపేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాలలో మూడు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హామీ అమలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే గ్రామాల్లో ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తుల స్వీకరణ ఆఫ్‌లైన్ పద్ధతిలో జరుగుతోంది. శనివారం నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు అధికారులు చెప్తున్నారు.
Read Entire Article