వరుస దొంగతనాలతో ఏలూరు జిల్లా వణికిపోతోంది. ఒక గ్యాంగ్ పోయింది అనుకునే సమయానికి ఇంకో గ్యాంగ్ వచ్చి చోరీలు చేస్తోంది. ధార్ గ్యాంగ్ వెళ్లిపోయింది అనుకుంటే ఇప్పుడు తెలంగాణ దొంగల ముఠాలు వరుస చోరీలు చేస్తున్నాయి. పట్టపగలే దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. రెక్కీ చేసి మరీ ఎప్పుడు ఎవరుంటారు అనేది తెలుసుకుని మరీ దొంగతనాలు చేస్తున్నారు. దొంగలు పట్టుకునేందుకు గస్తీ ఎక్కువగా పెంచామని పోలీసులు చెబుతున్నారు.