మాతా, శిశు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న ఏపీ ప్రభుత్వం.. ఆ దిశగా కొత్త తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను అందుబాటులోకి తెస్తోంది. ఈ వాహనాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం పరిశీలించారు. కొత్తగా ఏర్పాటు చేసిన సౌకర్యాలపై ఆరా తీశారు. మొత్తం 500 వాహనాలను త్వరలోనే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ వాహనాలతో ఏటా రూ.2.75 లక్షల మందికి ప్రయోజనం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.