Andhra Pradesh Transgenders Ration Cards: అమరావతి సచివాలయంలో ట్రాన్స్ జెండర్ వెల్ఫేర్ బోర్డు సమావేశం జరిగింది. ట్రాన్స్జెండర్ల సమస్యల పరిష్కారం, సంక్షేమం, నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి కల్పనపై సమావేశంలో చర్చించారు. ట్రాన్స్జెండర్లకు త్వరలోనే గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్కార్డులు జారీ చేస్తామని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి తెలిపారు. అలాగే ఆసుపత్రుల్లో ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక ఓపీ, బహిరంగ ప్రదేశాలు, ఆసుపత్రుల్లో వారికి ప్రత్యేక టాయిలెట్లు ఏర్పాటు చేస్తామన్నారు.