ఏపీని కొవిడ్ కలవరపెడుతోంది. కడప జిల్లాలో కొవిడ్ కేసులు తొలుత వెలుగుచూశాయి. ప్రస్తుతం నాలుగు జిల్లాలలో కేసులు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో కొవిడ్ కేసులపై ఆందోళన పడవద్దని ప్రజలకు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. కరోనా కేసులపై ప్రభుత్వం అప్రమత్తమైందని.. జాగ్రత్తలు తీసుకుంటోందని వివరించారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో కొవిడ్ కేసులు నమోదవుతున్నాయన్న ఆరోగ్యశాఖ మంత్రి.. ఏపీలో 13 కేసులు వెలుగుచూసినట్లు వెల్లడించారు.