ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు?

8 months ago 23
ఏపీలో మరో జాతీయ రహదారి విస్తరణకు కసరత్తు జరుగుతోంది. విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే కన్సల్టెన్సీ సంస్థ డీపీఆర్ తయారు చేసింది. ఈ ప్రతిపాదిత డీపీఆర్ మీద గత బుధవారం స్టేక్ హోల్డర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. రహదారి విస్తరణ కష్టమయ్యే ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. అలాగే డీపీఆర్‌లో అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్ల ప్రస్తావన లేకపోవటంతో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
Read Entire Article