50 Electric Buses To Bhogapuram International Airport Soon:ఏపీకి త్వరలోనే విద్యుత్ బస్సులు పరుగులు తీయబోతున్నట్లు రవాణాశాఖమంత్రి రామ్ప్రసాద్ రెడ్డి తెలిపారు. విశాఖపట్నానికి 100 విద్యుత్ బస్సులు వస్తాయని.. 50 బస్సుల్ని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు నడుపుతామని మంత్రి ప్రకటించారు. 50 ఎలక్ట్రిక్ బస్సుల్ని గాజువాక ఆర్టీసీ డిపోకు కేటాయిస్తామన్నారు. దూరం వెళ్లే బస్సులకు ఇద్దరు డ్రైవర్లు కచ్చితంగా ఉండాలని.. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.