ఏపీలో ఇంటర్ విద్యార్థులకు ఈ విషయం తెలుసా.. కొత్త రూల్ అమల్లోకి, వివరాలివే

1 year ago 32
Andhra Pradesh Inter Students Progress Reports: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు సరికొత్త విధానాన్ని అమలు చేస్తోంది. ప్రభుత్వ, ఎయిడెడ్‌ కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచి అధిక ఉత్తీర్ణత శాతం సాధించడానికి చర్యలు చేపట్టింది. కొత్తగా విద్యార్థులకు ప్రోగ్రెస్‌ కార్డుల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేస్తోంది. విద్యార్థుల హాజరు, వారికి కాలేజీలో నిర్వహించే పరీక్షల్లో సాధించిన మార్కుల వివరాలు ప్రోగ్రెస్ కార్డుల్లో నమోదు చేస్తారు. తల్లిదండ్రులకు చూపించి వారితో సంతకాలు చేయించి కాలేజీకి తీసుకురావాల్సి ఉంటుంది. అలాగే రెండు నెలలకు ఒకసారి పేరెంట్స్ మీటింగ్ కూడా నిర్వహిస్తారు.
Read Entire Article