Andha Pradesh PACS Employees Salaries 20% Hiked: ఏపీలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) ఉద్యోగులకు తీపికబురు. ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సిఫారసుల ఆధారంగా హెచ్ఆర్ పాలసీలో కొన్ని ఆర్థిక, సంక్షేమ చర్యల అమలుకు ఉత్తర్వులు జారీ చేశారు. రెగ్యులర్ ఉద్యోగులకు మూల వేతనంలో 20శాతానికి సమానంగా అదనపు వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పెంపు ప్రత్యేకంగా, మూలవేతనంలో కలపకూడదని స్పష్టం చేసింది.