ఏపీలో ఆ జిల్లాలలో మినహా మిగతా చోట్ల అధిక ఉష్ణోగ్రతలు.. విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా

1 year ago 35
ఆంధ్రప్రదేశ్‌లో మూడు నెలలపాటు ఎండలు, వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఈ మూడు నెలలు గర్భిణులు, బాలింతలు, పిల్లలు, వృద్ధులు వీలైనంత వరకూ బయట తిరగకుండా ఇళ్లల్లోనే ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. బయటకు వెళ్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వీలైనంత వరకూ శరీరం డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలని సూచించింది.
Read Entire Article