Andhra Pradesh Govt Transfers 6 Ips Officers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనాపరమైన కారణాలతో ఆరుగురు ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేయడంతో పాటుగా కొత్త పోస్టింగ్లు కల్పించింది. కొత్త జిల్లాలైన మార్కాపురం, పోలవరానికి ఓఎస్డీ (అడ్మిన్)లను నియమించింది. అమరావతిలో ఓఎస్డీ (లా అండ్ ఆర్డర్)గా కీలక అధికారిని నియమించారు. తాడిపత్రి ఏఎస్పీని పల్నాడు జిల్లాకు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా నియమించారు.