Visakhapatnam South Coast Railway Zone Gazette: కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.. విశాఖపట్నంలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2026 జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కేంద్రం గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను విశాఖ జోన్ పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ మేరకు అవసరమైన మార్పుల్ని కేంద్రం గెజిట్ నోటిఫికేషన్లో ప్రస్తావించారు.