Andhra Pradesh BPCL Refinery Rs 96000 Crores: ఏపీలో ఏర్పాటు కానున్న బీపీసీఎల్ ప్రాజెక్టుకు ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు అందించింది. స్టాంప్డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు మినహాయించారు. ఈ మేరకు బీపీసీఎల్ ప్రాజెక్టుకు 6,042 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ భూముల బదిలీ ప్రక్రియకు అనుమతించింది. ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలతో బీపీసీఎల్కు మొత్తం రూ.147.33 కోట్లకు పైగా ప్రయోజనం చేకూరనుంది. ఈ ప్రాజెక్టు నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే.