APSRTC To Get 5500 New Electric Buses Soon: ఏపీలో కొత్త విద్యుత్ బస్సులు పరుగులు తీసేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. జులై నుంచి కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఏపీ ప్రభుత్వం దశలవారీగా 5,500 విద్యుత్ బస్సుల్ని తీసుకురాబోతోంది. అలాగే మరో 500 సీఎన్జీ బస్సులు కూడా తీసుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కింద కొన్ని బస్సుల్ని మంజూరు చేయగా.. ప్రభుత్వం మరికొన్ని బస్సుల్ని కొనుగోలు చేయనుంది.