ఏపీకి మరో ప్రతిష్టాత్మక సంస్థ రానుందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. సోమవారం రోజున ముంబయిలో పర్యటించిన మంత్రి నారా లోకేష్.. ఎయిర్ ట్రంక్ సీఈవో రాబిన్ ఖుదాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎయిర్ ట్రంక్ నూతన క్యాంపస్ విశాఖలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు కోసం ఉన్న అవకాశాలను వివరించారు. మరోవైపు గతేడాది అక్టోబర్ నెలలోనూ రాబిన్ ఖుదాతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. తాజాగా రెండోసారి భేటీ అయ్యి.. విశాఖలో క్యాంపస్ ఏర్పాటు గురించి చర్చించారు.