APSRTC 150 Electric Busses To Amaravati Vijyawada: జులై కల్లా ఈ-బస్సు ప్రయాణం అందుబాటులోకి తీసుకు రావాలని ఆర్టీసీ ప్లాన్ చేస్తోంది. గుంటూరు రీజియన్లో 150 ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రతిపాదనలు పంపింది. అలాగే ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు క్షేత్రస్థాయిలో సన్నాహాలు మొదలయ్యాయి. ఈ బస్సులు గుంటూరు, మంగళగిరి టు అమరావతి, విజయవాడకు రాకపోకలు కొనసాగించనున్నాయి. జులై నుంచి ఈ విద్యుత్ బస్సుల్ని నడిపేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు.