ఏపీ వాసులకు అలర్ట్.. ఆ పథకం పేరు మారింది.. కొత్త పేరు ఏంటంటే?

1 year ago 35
ఏపీ వాసులకు ముఖ్య గమనిక. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకం పేరు మార్చింది. గత వైసీపీ సర్కారు అమలు చేసిన పలు పథకాల పేర్లను టీడీపీ కూటమి సర్కారు మారుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జగనన్న కాలనీలు పేరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చింది. జగనన్న కాలనీల పేరును పీఎంఏవై - ఎన్టీఆర్ నగర్‌గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే అమ్మ ఒడి, జగనన్న భూ రక్ష, జగనన్న గోరుముద్ద, వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ, వైఎస్ఆర్ పెన్షన్ కానుక వంటి పథకాల పేర్లను ఏపీ ప్రభుత్వం మార్చిన సంగతి తెలిసిందే.
Read Entire Article