Annadata Sukhibhava Scheme Funds Release On June 20: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాతల కోసం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ ఏడాది తొలి విడత అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం కింది డబ్బుల్ని విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా రూ.7వేలు చొప్పున రైతుల అకౌంట్లలోకి డబ్బుల్ని విడుదల చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.5వేలు, కేంద్రం రూ.2వేలు కలిపి ఇస్తారు.